రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

మంచితోనే సమాజంలో గుర్తింపు

General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET AP DSC Tenth Hall Tickets
Mounikadesk

మంచితోనే సమాజంలో గుర్తింపు

పేద కుటుంబాలు పైకి రావాలి

ముప్పాళ్లలో ‘మార్గదర్శి-బంగారు కుటుంబం’ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు

CM Nara Chandrababu Naidu

నందిగామ/ముప్పాళ్ల : సమాజానికి ఏదైనా మంచి చేసినప్పుడు తృప్తి కలుగుతుంది. గుర్తింపు, గౌరవం కావాలని కొందరు అనుకుంటుంటారు. డబ్బుతో ఎప్పుడూ గౌరవం రాదు. సమాజానికి మంచిపని చేస్తేనే గౌరవం, గుర్తింపు లభిస్తుంది’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఎన్టీఆర్ జిల్లా, నందిగామ నియోజకవర్గం, ముప్పాళ్లలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమం అనంతరం మార్గదర్శి-బంగారు కుటుంబం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ గ్రామంలో 41 పేద కుటుంబాలు ఉన్నట్లు గుర్తించామన్నారు. ప్రజా వేదిక సభలో బంగారు కుటుంబ సభ్యుల పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మార్గదర్శి గోగినేని రవిచంద్రను సన్మానించారు. అనంతరం సీఎం మాట్లాడారు. 

ప్రపంచంలోనే అద్భుత కార్యక్రమం పీ4

‘మార్గదర్శి-బంగారు కటుంబం’ ఒక చరిత్రాత్మక కార్యక్రమం. ఇటువంటిది ప్రపంచంలో ఎక్కడా లేదు. ప్రభుత్వాలు సంక్షేమ కార్యక్రమాలు తీసుకురావడంతో పాటు ఆర్థిక సంస్కరణలు కూడా తీసుకొచ్చాయి. సంక్షేమ కార్యక్రమాలతో కొంత వెసులుబాటు వచ్చినా అసమానతలు తగ్గడం లేదు. ప్రజల జీవనప్రమాణాలు పడిపోతున్నాయి. పేదరికం వెంట తెచ్చుకుంటే వచ్చేది కాదు. తరతరాలు పేదరికంలోనే ఉంటూ ఇబ్బందులు పడుతున్నారు. పీ4 ద్వారా పేదలకు సహకారం అందుతుంది. భారతరాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కర్‌కు ఆ రోజుల్లో బరోడా మహారాజు ఆర్థిక సహకారం అందించారు. లండన్ వెళ్లి చదువుకోవడానికి చేయూతనిచ్చారు. దేశం మెచ్చుకునే మేథావిగా అంబేద్కర్ తయారయ్యారు. అబ్దుల్ కలాం లాంటి గొప్ప వ్యక్తి వెనక కూడా అయ్యంగార్ ఉన్నారు. కలాంను అయ్యంగార్ శిష్యుడిగా దగ్గరకు తీసుకుని గణితం, సైన్స్ నేర్పించి శాస్త్రవేత్త అవ్వడానికి సాయపడ్డారు. వివేకానందను రామకృష్ణ పరమహంస తీర్చిదిద్దారు.’ అని సీఎం అన్నారు. 

పేద పిల్లలు పైకి ఎదగాలి

‘స్వాతంత్ర్య సమరయోధులు గాంధీ అయినా, ఎన్టీఆర్, మోదీ, నేను చిన్న కుటుంబాల్లోనే పుట్టాం. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని అంచలంచెలుగా ఎదిగాం. మీ పిల్లలు కూడా ఇదే విధంగా పైకి రావాలి. అందుకే ఈ పీ4 కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. పేద కుటుంబాలను పేదరికం నుంచి పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ పీ4 తెచ్చాం. ఈ గ్రామంలో గుర్తించిన 41 బంగారు కుటుంబాలతో పాటు ఎవరైనా బంగారు కటుంబంలో చేరే వారికి అవకాశం కల్పిస్తాం. బాగా చేసిన మార్గాదర్శులను గౌరవించి, సన్మానిస్తాం.’ అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.  

బంగారు కుటుంబానికి ఎంపికైన వారు మాట్లాడుతూ...

పగడాల నాగరత్నం:- నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. బాబు రెండవ క్లాసు చదవుతున్నాడు. నా భర్త పొలం పనులకు వెళ్తున్నారు. నేను మిషన్ నేర్చుకుంటున్నాను. సొంత ఇళ్లు, స్థలం కూడా లేదు. నేను కుట్టుమిషన్ నేర్చుకుంటున్నాను. నాకు కుట్టు మిషన్, నా భర్తకు ఇటో అందిస్తే ఉపాధి పొందుతాం. 

భాగ్యమ్మ : నాకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. నేను ప్రస్తుతం వేరుగా ఉంటున్నా. నా భర్త ఏడాది క్రితం చనిపోయారు. నాకు పెన్షన్ అందించాలని కోరుతున్నా. 

సీఎం : కలెక్టర్ గారు...భాగ్యమ్మకు వెంటనే పింఛను మంజూరు చేయండి. 

రమాదేవి : నేను ఇంటర్మీడియట్ చదివా, నా భర్త ఆరవ తరగతి చదివారు. మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారు ప్రభుత్వ స్కూళ్లో చదువుకుంటున్నారు. నా భర్త కూలీ పనులకు వెళ్తే రోజూ రూ.300 వస్తోంది. మాకు ఉండటానికి సొంత ఇల్లు లేదు. ఇల్లు కట్టించి, గేదెలు అందిస్తే వాటిని చూసుకుంటాం. 

కోండ్రు రమేష్ : మాకు సొంత ఇల్లు లేదు. నా భార్య, కుమారుడు చనిపోయారు. చిన్న కొడుకు ఏడవ తరగితి చదువుకుంటున్నాడు. నేను కూలీ పనులకు వెళ్తే రోజుకు రూ.350 వస్తుంది. 18 ఏళ్ల వయసు కొడుకును పోగొట్టున్నా, సాయం అందిస్తే చిన్నకొడుకునైనా చదివించుకుంటాను.  

మార్గదర్శులు మాట్లాడుతూ....

గోగినేని రవిచంద్ర : సీఎం చంద్రబాబు తీసుకొచ్చి పీ4 - జీరో పావర్టీ కార్యక్రమం స్ఫూర్తి నింపేలా ఉంది. పారిశ్రామిక వేత్తలు, ఎన్ఆర్ఐలు దీని గురించి ఆసక్తిగా అడుగుతున్నారు. గతంలో ఏదైనా సాయం అందించడానికి లబ్ధిదారుల జాబితా సిద్ధం చేయడానికి సమయం పట్టేది. లబ్ధిదారులకు నిజంగా చేరుతుందా లేదా అనే సంశయం కలిగేది. కానీ ఈ పీ4 అందరికీ అందుబాటులో ఉంది. పెద్దవరం గ్రామంలో మాకు ఇథనాల్ తయారీ యూనిట్ ఉంది. గతేడాది కొత్త యూనిట్ కూడా ప్రారంభించాం. 480 మంది ఉపాధి పొందుతున్నారు. బంగారు కుటుంబంలో ఎంపికైన పగడాల నాగరత్నం బిడ్డల చదవును మేం భరిస్తాం. ఆమె భర్తకు ఆటో ఇవ్వడంతో పాటు మా ప్యాక్టరీలో వ్యాపారం చేసుకుని ఎంట్రప్రెన్యూర్ అయ్యే అవకాశాన్ని కల్పిస్తాం. నాగరత్నం కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంటాం. వారి కుటుంబ ఎదుగుదలకు మా సంస్థ నుంచి పూర్తి సహకారం అందిస్తాం. ఈ సందర్భంగా గోగినేని రవిచంద్రను సీఎం అభినందించారు. 

తోటకూరి శ్రీనివాసరావు, గ్రీన్ వే గ్రూప్ ఆఫ్ కంపెనీ

పరిటాలలో మేము బ్రిక్స్ ఫ్యాక్టరీ పెట్టాం. జన్మభూమి కార్యక్రమం రూపంలో పీ4 వచ్చింది. మేం ఒక కుటుంబాన్ని దత్తత తీసుకున్నాం. ప్రతిరోజూ ఇద్దరు ముగ్గురితో మాట్లాడి నాలుగైదు కటుంబాలు దత్తత తీసుకునేలా చేస్తాం. మాకు దాదాపు 500 కన్సల్టెన్సీలతో సంబంధాలు ఉన్నాయి. డిజిటల్ మార్కెట్‌లో ఈ పీ4 ప్రమోట్ చేస్తాం. ఒక 1000 కుటుంబాలు బంగారు కుటుంబంలో ఎంపికయ్యేందుకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తాను. 

జయేష్ కుమార్ షా, ట్విల్స్ క్లాతింగ్ ఇండియా డైరెక్టర్

మేం ఈ నేలపై పుట్టి పెరిగాం. మాకు ఈ జన్మభూమి చాలా ఇచ్చింది. వచ్చిన అవకాశాలతో వ్యాపారం చేసి పైకి ఎదిగాం. మాకు ఎంతో ఇచ్చిన ఈ సమాజానికి తిరిగి ఇచ్చే బాధ్యత ఉంది. ఈ పీ4 గురించి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ చెప్పినప్పుడు చాలా సంతోషాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చింది. నాకు ఏ బాధ్యత అప్పగించినా తప్పకుండా ముందుకు తీసుకెళ్తాను. 

మధుసూధన్ రావు, కేసీపీ ఇండియా షుగర్ ఫ్యాక్టరీ ప్రతినిధి 

ఈ పీ4 వినూత్న కార్యక్రమం. దేశంలోనే ఇది మొట్టమొదటి కార్యక్రమం. పేదరిక నిర్మూలన కోసం మీరు వేసిన అడుగులో మేం అడుగుల వేస్తాం. ముక్త్యాల గ్రామాన్ని మేం దత్తత తీసుకున్నాం. గ్రామంలో 800 మందికి హెల్త్ కార్డులు అందించాం. ముప్పాలలో వేల్పుల మణెమ్మ కుటుంబాన్ని దత్తత తీసుకుంటాం. ఆ కుటుంబంలోని విద్యార్థులకు విద్యకు అవసరమైన సాయాన్ని అందిస్తాం. 

వల్లభనేని రామకృష్ణ, అంబా కోచ్ బిల్డర్స్

మీ స్ఫూర్తితో మేం ఒక కుటుంబాన్ని దత్తత తీసుకుంటాం. విద్య, వైద్యానికి సంబంధి కుటుంబ అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తాం.

Comments

-Advertisement-