గూగుల్ల్లో మళ్లీ ఊచకోత.. డేంజర్ జోన్లో బెంగళూరు, హైదరాబాద్! వేలాది ఉద్యోగాలు ఉఫ్..
గూగుల్ల్లో మళ్లీ ఊచకోత.. డేంజర్ జోన్లో బెంగళూరు, హైదరాబాద్! వేలాది ఉద్యోగాలు ఉఫ్..
ప్రపంచ వ్యాప్తంగా గూగుల్ సంస్థల్లో లేఆఫ్లు కొనసాగుతున్నాయి. తాజాగా భారత్లో మరో రౌండ్ తొలగింపులకు సిద్ధమవుతోంది. ఈసారి ఉద్యోగాల కోతలు భారీగానే ఉండనున్నట్లు సమాచారం.
ప్రధానంగా హైదరాబాద్, బెంగళూరులోని గూగుల్ కార్యాలయాలలో ఈ లేఆఫ్లు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అయితే భారత్లో దీని ఉద్యోగుల తొలగింపులను గూగుల్ అధికారికంగా ధృవీకరించనప్పటికీ బిజినెస్ స్టాండర్డ్ నివేదిక ప్రకారం ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ వచ్చే వారంలోనే ప్రారంభం కావచ్చని పేర్కొంది.
గూగుల్ ప్లాట్ఫారమ్లు, డివైజెస్ డివిజన్లో తాజాగా జరిగిన రీకన్స్ట్రక్షన్ తర్వాత తాజా వార్తలు వెలువడ్డాయి. దీని ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా గూగుల్ సంస్థల్లో పనిచేస్తున్న వందలాది మంది ఉద్యోగులపై వేటు పడనుంది.
ఆండ్రాయిడ్, పిక్సెల్, క్రోమ్ బ్రౌజర్ను నిర్వహిస్తున్న తన ప్లాట్ఫామ్స్ అండ్ డివైజెస్ యూనిట్లో వందలాది మందికి ఉద్వాసన పలికేందుకు సిద్ధమైంది.
అయితే భారత్లో గూగుల్ కొంచెం ఎక్కువగానే ఈ విషయంపై దృష్టి సారించినట్లు నివేదిక వెల్లడించింది. ముఖ్యంగా ఇంజనీరింగ్ విభాగంపై ఫోకస్ పెట్టింది. ప్రత్యక్ష తొలగింపులకు బదులుగా హైదరాబాద్, బెంగళూరు క్యాంపస్లలో సాంకేతిక స్థానాల్లో ఉన్న ఉద్యోగులపై వేటు పడనుంది.
కంపెనీ అంతర్గత నిర్మాణంలో విస్తృత మార్పుల మధ్య గూగుల్ కొత్త తొలగింపులు చేపట్టింది. గత ఏడాది గూగుల్ తన ప్లాట్ఫామ్లు, పరికరాల బృందాలను విలీనం చేసింది. 2024లో ఆండ్రాయిడ్, పిక్సెల్ విభాగాలను విలీనం చేసిన తర్వాత ఈ ఏడాది ప్రారంభంలోనే అమెరికాలోని ఉద్యోగుల కోసం స్వచ్ఛంద పదవీ విరమణ ప్రకటించింది.
ఫిబ్రవరిలో గూగుల్ క్లౌడ్ విభాగం నుంచి ఉద్యోగులను తొలగించింది. కంపెనీ నుంచి స్వచ్ఛందంగా నిష్క్రమించడానికి జనవరిలో ఉద్యోగులకు బైఅవుట్ ఆప్షన్ ఇచ్చినట్లు గూగుల్ కూడా ధృవీకరించింది.
ప్రధాన సాంకేతిక సంస్థల మాదిరిగానే గూగుల్ కూడా మారుతున్న డిజిటల్ ఆర్థిక వ్యవస్థను నావిగేట్ చేస్తోంది. ఉత్పాదక AI పెరుగుదల, అధిక ప్రాధాన్యత గల వ్యాపార రంగాలతో ఖర్చును తగ్గించుకోవడానికి గూగుల్ చర్యలకు ఉపక్రమించింది.
లేఆఫ్ డాట్ ఎఫ్వైఐ ప్రకారం.. 2025 ప్రారంభం నాటికి ప్రపంచవ్యాప్తంగా 108 కంపెనీలలో 28 వేల మందికి పైగా టెక్ కార్మికులు ఉపాధి కోల్పోయారు. గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి ప్రధాన కంపెనీల్లో ఈ లేఆఫ్లు చోటుచేసుకున్నట్లు వెల్లడించింది. మైక్రోసాఫ్ట్ మే 2025 నాటికి కొత్తగా మరికొంత మంది ఉద్యోగులపై వేటుకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి.