రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

ఇకపై ప్రశ్నపత్రాలపై మార్పు లీక్‌ చేస్తే కఠిన చర్యలే..!

trending post trendingnews viralposts viral news trendingnow trendingfashion trendingtopic trendings intresting facts Intersting news Viral news facts
Peoples Motivation
ఇకపై ప్రశ్నపత్రాలపై మార్పు లీక్‌ చేస్తే కఠిన చర్యలే..!
• పదో తరగతి పరీక్షల సమయంలో లీకేజీలను అరికట్టేందుకు విద్యాశాఖ పటిష్ట చర్యలు..

• తొలిసారి ప్రశ్నాపత్రాలపై సీక్రెట్‌ సెక్యూరిటీ కోడ్‌..

• పదో తరగతి మెమోలపై పర్మినెంట్‌ ఎడ్యకేషన్‌ నెంబర్‌(పెన్‌)..

• మార్చి 21 నుంచి ఏప్రిల్‌ 4వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు..
trending post trendingnews viralposts viral news trendingnow trendingfashion trendingtopic trendings intresting facts Intersting news Viral news facts

హైదరాబాద్‌, (పీపుల్స్ మోటివేషన్):- రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు మార్చి 21వ తేదీ నుంచి ఏప్రిల్‌ 4వ తేదీ వరకు జరగనున్నాయి. ఈసారి 5.1 లక్షల మంది విద్యార్థులు పరీక్ష ఫీజును చెల్లించారు. పదో తరగతి పరీక్షల సమయంలో లీకేజీలను అరికట్టేందుకు విద్యాశాఖ పటిష్ట చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా తొలిసారి ప్రశ్నాపత్రాలపై సీక్రెట్‌ సెక్యూరిటీ కోడ్‌ను ముద్రించనుంది. పరీక్షల కోసం రూపొందించిన అన్ని ప్రశ్నాపత్రాల్లో ఈ సీక్రెట్‌ సెక్యూరిటీ కోడ్‌ ఉంటుంది. ఈ కోడ్‌ ద్వారా ఎవరైనా పేపర్‌ను లీక్‌ చేస్తే గంటల వ్యవధిలోనే పట్టుకోవచ్చు.

విద్యాశాఖ కఠిన చర్యలు..

గతంలో కొందరు ఇన్విజిలేటర్లు పదో తరగతి పేపర్లను లీక్‌ చేయడం, వాట్సాప్‌లో షేర్‌ చేయడం వంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని లీకేజీలకు పాల్పడిన వారిని కేవలం సస్పెన్షన్‌లతో సరిపెట్టకుండా ఉద్యోగాల నుంచి శాశ్వతంగా తొలగిస్తుండటంతో టీచర్లు సైతం ఇలాంటి చర్యలకు సాహసించడం లేదు. పేపర్‌ లీకేజీలకు పాల్పడిన వారిపై విద్యాశాఖ కఠిన చర్యలు తీసుకుంటుంది.

ఈసారి పరీక్షల్లో మార్పులివే..

• ఈసారి నుంచి పదో తరగతి విద్యార్థులకు 24 పేజీల బుక్‌లెట్‌ను ఇస్తారు. ఇది వరకు విడిపేపర్లు ఇచ్చేవారు.

• ఆన్సర్లు రాసిన పేపర్లను కూర్చి, దారం కట్టాల్సి వచ్చేది. ఇక నుంచి కేవలం బుక్‌లెట్‌ మాత్రమే ఇస్తారు.

• ఈ ఏడాది నుంచి గ్రేడింగ్‌ విధానాన్ని రద్దు చేయడంతో విద్యార్థులకు కేవలం మార్కులు మాత్రమే వేస్తారు. 

• అయితే ఇంటర్నల్స్‌, థియరీ పరీక్షల మార్కులను కలిపి మొత్తం మార్కులేస్తారు.

• ఈ ఏడాది మాత్రమే ఇంటర్నల్‌ మార్కులుంటాయి. వచ్చే ఏడాది (2025- 26 ) నుంచి ఇంటర్నల్‌ మార్కులుండవు. మొత్తం 100 మార్కులకు పరీక్షను నిర్వహిస్తారు.

• గతేడాది నుంచి ఆరు పేపర్లకుగాను ఏడు రోజులపాటు పరీక్షలను నిర్వహిస్తున్నారు. సైన్స్‌లో జీవశాస్త్రం, భౌతికశాస్త్రం పేపర్లకు రెండు రోజుల పాటు పరీక్షలను నిర్వహిస్తున్నారు.

• పదో తరగతి మెమోలపై పర్మినెంట్‌ ఎడ్యకేషన్‌ నెంబర్‌(పెన్‌)ను ముద్రిస్తున్నారు. వ్యక్తికి ఆధార్‌ ఎలాగో విద్యార్థులకు “పెన్‌” అలాగే పనిచేస్తుంది.
Comments

-Advertisement-