APPSC: గ్రూప్-2 అభ్యర్థులకు బిగ్ అలర్ట్..హాల్ టికెట్లు విడుదల
APPSC: గ్రూప్-2 అభ్యర్థులకు బిగ్ అలర్ట్..హాల్ టికెట్లు విడుదల
• గ్రూప్ 2 మెయిన్స పరీక్ష హాల్ టికెట్లను ఏపీపీఎస్సీ విడుదల..
• 13వ తేదీ గురువారం నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు..
• ఫిబ్రవరి 23వ తేదీ మెయిన్స్ పరీక్ష..
• ఈ పరీక్షల ద్వారా మొత్తం 905 ఉద్యోగాలు భర్తీ..
అమరావతి, ఫిబ్రవరి 12 (పీపుల్స్ మోటివేషన్):- ఫిబ్రవరి 23వ తేదీ గ్రూప్ -2 మెయిన్స్ పరీక్ష ఏపీపీఎస్సీ నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో గ్రూప్ -2 పరీక్ష హాల్ టికెట్లను 13వ తేదీ గురువారం నుంచి డౌన్ లోడ్ చేసుకో వచ్చని అభ్యర్థులకు ఏపీపీఎస్సీ సూచించింది. ఫిబ్రవరి 23వ తేదీ ఉదయం, మధ్యాహ్నం రెండు పేపర్లకు ఆఫ్ లైన్లో ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పింది. రాష్ట్రంలోని ఉమ్మడి 13 జిల్లా కేంద్రాల్లో ఈ పరీక్షలను నిర్వహిస్తున్నట్లు ఏపీపీఎస్సీ వివరించింది.
మొత్తం 905 ఉద్యోగాలు భర్తీ...
2023, డిసెంబర్ 7వ తేదీన గ్రూప్ 2 నోటిఫికేషన్ను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. డిసెంబర్ 21వ తేదీ నుంచి ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని నోటిఫికేషన్లో స్పష్టం చేసింది. 2024, జనవరి 10వ తేదీ దరఖాస్తు చేసుకొనేందుకు చివరి తేదీగా నిర్ణయించింది. 2024, ఫిబ్రవరి 25వ తేదీన ఈ గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్షను ఏపీపీఎస్సీ నిర్వహించింది. ప్రిలిమ్స్ ఫలితాలు వెలువడిన అనంతరం మెయిన్స్ పరీక్షలు పలు దఫాలుగా వాయిదా పడుతూ వస్తున్న సంగతి తెలిసిందే. చివరకు 2025, ఫిబ్రవరి 23వ తేదీన గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలను నిర్వహిస్తున్నారు. అసలు అయితే గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష ఈ ఏడాది ప్రారంభంలో అంటే జనవరి 5వ తేదీన నిర్వహించాలని ఏపీపీఎస్సీ నిర్ణయించింది. ఈ మేరకు పరీక్షా తేదీని సైతం ఖరారు చేసింది. కానీ సిలబస్ మార్పుతోపాటు పూర్తి స్థాయి సన్నద్దత కోసం మరింత గడువు కావాలని అభ్యర్థులు.. ఏపీపీఎస్సీని కోరారు. ఈ నేపథ్యంలో ఈ పరీక్షా తేదీని ఫిబ్రవరి 23వ తేదీకి మార్చింది. గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షకు 92, 250 మంది అర్హత సాధించారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 905 ఉద్యోగాలు భర్తీ కానున్నాయి.