ROAD ACCIDENT: ఘోర రోడ్డు ప్రమాదం..లారీ బోల్తా ఏడుగురు మృతి
ROAD ACCIDENT: ఘోర రోడ్డు ప్రమాదం..లారీ బోల్తా ఏడుగురు మృతి
• వరంగల్లో మామూనూరు ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం..
• ఇనుప స్తంభాలు తీసుకువెళ్తున్న లారీ బోల్తా..
• ఏడుగురు అక్కడికి అక్కడే మృతి..
ROAD ACCIDENT : వరంగల్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. ఇనుప స్తంభాలు తీసుకువెళ్తున్న ఓ లారీ అదుపు తప్పి పక్కనే ఉన్న రెండు ఆటోలు, ఓ కారుపై పడింది. మామూనూరు ప్రధాన రహదారిపై ఈ ప్రమాదం సంభవించింది. దీంతో ఏడుగురు అక్కడికక్కడే మరణించారు. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ కాలు విరిగిపోయింది.
ROAD ACCIDENT : వరంగల్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. ఇనుప స్తంభాలు తీసుకువెళ్తున్న ఓ లారీ అదుపు తప్పి పక్కనే ఉన్న రెండు ఆటోలు, ఓ కారుపై పడింది. మామూనూరు ప్రధాన రహదారిపై ఈ ప్రమాదం సంభవించింది. దీంతో ఏడుగురు అక్కడికక్కడే మరణించారు. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ కాలు విరిగిపోయింది.
ఈ ప్రమాదంలో మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఆటో డ్రైవర్ కాలు కూడా విరిగిపోయింది. ఇనుప రాడ్ల కింద మరికొందరు వ్యక్తులు ఉన్నట్లుగా తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. కాగా, ప్రమాదంలో మరణించిన వారిని మధ్యప్రదేశ్లోని భోపాల్ జిల్లా లలితానగర్కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. లారీ డ్రైవర్ మద్యం మత్తులో ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.