మాకు రిట్రో ఫిట్మెంట్ మోడల్ కింద బస్సులను కేటాయించండి
మాకు రిట్రో ఫిట్మెంట్ మోడల్ కింద బస్సులను కేటాయించండి
కాలుష్యాన్ని నియంత్రించాలన్న లక్ష్యంలో భాగంగా హైదరాబాద్ మహానగరంలో వంద శాతం బస్సులను ఎలక్ట్రిక్ మోడల్లోకి మార్చేందుకు సహకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామి కి విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి ఢిల్లీలో కుమారస్వామి ని వారి కార్యాలయంలో కలిసి ఈ విషయంపై చర్చించారు.
✅పీఎం ఈ-డ్రైవ్ (PM E-Drive) పథకం కింద జీసీసీ పద్ధతిలో తెలంగాణకు బస్సులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన విషయాన్ని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కి గుర్తుచేశారు.
✅ప్రస్తుతం ఉన్న డీజిల్ బస్సులకు ఎలక్ట్రిక్ కిట్ అమర్చి రిట్రో ఫిట్మెంట్ పద్ధతిలో ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చేందుకు అవకాశం ఉన్న విషయాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తెచ్చారు.
✅హైదరాబాద్కు కేంద్ర ప్రభుత్వం కేటాయించే 2,800 బస్సులను జీసీసీతో పాటు రిట్రో ఫిట్మెంట్ మోడల్ కింద కేటాయించాలని సీఎం విజ్ఞప్తి చేశారు.
✅ముఖ్యమంత్రి వెంట మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీలు పోరిక బలరాం నాయక్, కె. రఘువీర్ రెడ్డి, ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి వి.శేషాద్రి, ఆర్ అండ్ బీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (మౌలిక వసతులు) శ్రీనివాసరాజు, తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ గారు ఉన్నారు.