రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

Bank Robbery: మంగళూరులో భారీ దోపిడీ... రూ.12 కోట్ల విలువైన బంగారం ఎత్తుకెళ్లిన దొంగలు

Bank Robbery General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET AP DSC Tenth Hal
Peoples Motivation

Bank Robbery: మంగళూరులో భారీ దోపిడీ... రూ.12 కోట్ల విలువైన బంగారం ఎత్తుకెళ్లిన దొంగలు

>> తాజాగా మంగళూరులోని బ్యాంకులో భారీ దోపిడీ

>> రూ.12 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, రూ.5 లక్షల నగదు దోపిడీ

>> కర్ణాటకలోని బీదర్ లో ఏటీఎం వద్ద రూ.93 లక్షలు దోచుకున్న దొంగలు..

Bank Robbery

కర్ణాటకలో ఇద్దరు దోపిడీ దొంగలు ఏటీయం వద్ద కాల్పులు జరిపి ఒకరిని చంపి రూ.93 లక్షలు ఎత్తుకెళ్లిన ఘటన మరువక ముందే మరో భారీ దోపిడీ జరిగింది. తాజాగా, ఐదుగురు సాయుధ దుండగులు రూ.12 కోట్ల విలువైన బంగారం ఎత్తుకెళ్లారు. మంగళూరులోని కేసీ రోడ్ లో ఉన్న కోటేకర్ ఉల్లాల్ కోపరేటివ్ బ్యాంకులో ఈ దోపిడీ జరిగింది. 

తుపాకులు, కత్తులు, చాకులు చేతపట్టుకుని వచ్చిన ఐదుగురు దుండగులు బ్యాంకు సిబ్బందిని బెదిరించి రూ.12 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను, రూ.5 లక్షల నగదును దోచుకున్నారు. ఆ దోపిడీ ముఠా బంగారం, నగదును నాలుగైదు బ్యాగుల్లో నింపుకుని అక్కడ్నించి పరారైంది. 

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు... బ్యాంకులో పనిచేసేవారిపై అనుమానాలు వ్యక్తం చేశారు. బ్యాంకులోని సీసీ కెమెరాలను మరమ్మతుల కోసం టెక్నీషియన్ వద్దకు పంపించడం పోలీసుల అనుమానాలకు కారణమైంది. సీఎం సిద్ధరామయ్య మంగళూరు పర్యటనకు వచ్చిన సందర్భంగా పోలీసులంతా ఆయన బందోబస్తుకు వెళ్లారు. ఇదే అదనుగా దొంగలు బ్యాంకును దోపిడీ చేసినట్టు భావిస్తున్నారు. 

కాగా, కర్ణాటకలోపి బీదర్ లో ఏటీఎం వద్ద భారీగా నగదు దోచుకున్న దొంగలు హైదరాబాద్ పారిపోయి రావడం తెలిసిందే. వారిని వెదుక్కుంటూ బీదర్ పోలీసులు కూడా హైదరాబాద్ వచ్చారు. దొంగలు ఓ బస్సులో ఉండగా, ట్రావెల్స్ మేనేజర్ వారిపై అనుమానం వ్యక్తం చేశాడు. దాంతో ఆ దొంగలు ట్రావెల్స్ మేనేజర్ పై కాల్పులు జరిపి పారిపోయారు.

Comments

-Advertisement-