ఘోర రోడ్డు ప్రమాదం... వాహనం బోల్తాపడి 17 మంది మృతి
Crime News
Chattisgarh 17 coolies died
Road accident 17 death
Latest crime News
Road accident in chattisgarh karidham district
Latest political News
By
Peoples Motivation
ఘోర రోడ్డు ప్రమాదం... వాహనం బోల్తాపడి 17 మంది మృతి
బీడీ ఆకుల కోసం వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం
కబీర్ధామ్ జిల్లాలో లోయలో పడిన వాహనం
మృతుల్లో 14 మంది మహిళలు ఉన్నట్లు గుర్తింపు
ఛత్తీస్గఢ్లో ఘోర ప్రమాదం జరిగింది. కవర్దా ప్రాంతంలో వాహనం బోల్తాపడి 17 మంది మృతి చెందారు. 8 మందికి గాయాలయ్యాయి. కబీర్ధామ్ జిల్లాలో ఓ లోయలో వాహనం పడిపోయింది. మృతుల్లో 14 మంది మహిళలు ఉన్నట్లుగా తెలుస్తోంది. బైగా ట్రైబల్ కమ్యూనిటీకి చెందిన 25 నుంచి 30 మంది బీడీ ఆకుల కోసం వెళ్లారు. ఆకులు ఏరిన తర్వాత వారిని తిరిగి ఎక్కించుకొని వాహనం వెనక్కి తీసుకువస్తోంది. ఈ సమయంలో వాహనం లోయలోకి బోల్తా కొట్టింది. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ వాహనంలో ప్రయాణిస్తున్న వారంతా కుయ్ గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. బైగా కమ్యూనిటీ ఎక్కువగా బీడీలు చేస్తుంది. బీడీ ఆకు కోసం వీరు అడవులకు వెళుతుంటారు. ఈ ఆకులు మార్చి నుంచి మే మధ్య వస్తాయి.
Comments