-Advertisement-

ఘోర రోడ్డు ప్రమాదం..ఆరుగురు మృతి

Latest crime news in Telugu, Crime news Telugu, today Crime news, Breaking News Telugu, latest updates in crime news telugu,crime news channels, crime
Peoples Motivation

ఘోర రోడ్డు ప్రమాదం..ఆరుగురు మృతి

Road accident in Suryapeta district
సూర్యాపేట, ఏప్రిల్ 25 (పీపుల్స్ మోటివేషన్):-

సూర్యాపేట జిల్లాలో ఈ తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. కోదాడ పట్టణ పరిధిలోని శ్రీరంగాపురం సమీపంలో  జాతీయ రహదారిపై ఈరోజు ఉదయం ఆగిఉన్న లారీని వెనక నుంచి కారు ఢీకొట్టడంతో అందులో ఉన్న ఓ చిన్నారి తో సహా ఆరుగురు చనిపోయారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాద సమయంలో కారులో ఎనిమిది మంది ప్రయాణిస్తున్నారు. ఆరు గురు ఘటనాస్థంలోనే చనిపోయారు. గాయపడిన ఇద్దరిని కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వారు హైదరాబాద్‌ నుంచి విజయవాడకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతుల పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Comments

-Advertisement-