-Advertisement-

ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీ కొట్టిన ఆటో..3 మృతి.. మరికొంత మంది పరిస్థితి విషమం

Latest crime news in Telugu, Crime news Telugu, today Crime news, Breaking News Telugu, latest updates in crime news telugu,crime news channels, news
Peoples Motivation

ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీ కొట్టిన ఆటో..3 మృతి.. మరికొంత మంది పరిస్థితి విషమం

Latest Road Accident News In Suryapeta
సూర్యాపేట, ఏప్రిల్ 04 (పీపుల్స్ మోటివేషన్):-

ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఆటో ఢీ కొట్టింది. ఈ ఘటన సూర్యాపేట హైటెక్ బస్ స్టాండ్ సమీపంలో హైదరాబాద్- విజయవాడ 65వ జాతీయ రహదారిపై గురువారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో...సూర్యాపేట పట్టణానికి చెందిన పుట్టా సరిత (41) టీచర్ అక్కడిక్కడే మృతి చెందింది. సూర్యాపేట మండలం లక్ష్మీతండాకు చెందిన రుణావత్ రుక్కమ్మ(63), రెండేళ్ల చిన్నారి సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మిగిలిన క్షతగాత్రులకు వైద్య సేవలు కొనసాగుతున్నాయి. గాయపడిన వారిలో మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రమాద సమయంలో ఆటోలో 14 మంది ప్రయాణికులు ఉన్నట్టు పోలీసులు తెలిపారు.

Comments

-Advertisement-