-Advertisement-

జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశాలను లెక్క చేయని అధికారులు...

Peoples Motivation

జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశాలను లెక్క చేయని అధికారులు...

నంద్యాల జిల్లా వక్ఫ్ బోర్డ్ అధికారులు, శిరివెళ్ల మండల తహశీల్దార్ పై చర్యలు తీసుకోవాలి

- డెమొక్రటిక్ విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు షేక్ రియాజ్ డిమాండ్

Thumbnails pm news tdp

నంద్యాల/ శిరివెళ్ల, మార్చి 02 (పీపుల్స్ మోటివేషన్):-

గత నెల 26/02/2024 న శిరివెళ్ల వక్ఫ్ బోర్డ్ భూములలో అనధికారికంగా నిర్మిస్తున్న ఇళ్ల నిర్మాణాలను ఆపాలని నంద్యాల వక్ఫ్ బోర్డ్ అధికారులను, శిరివెళ్ల తహసిల్దార్ ను నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశించారనీ డెమొక్రటిక్ విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు షేక్ రియాజ్ అన్నారు. ఈ మేరకు శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ నంద్యాల జిల్లా వక్ఫ్ బోర్డ్ అధికారులు, శిరివెళ్ల మండల తహశీల్దార్ అండదండలతో యధేచ్ఛగా వక్ఫ్ బోర్డ్ భూములలో శిరివెళ్ల రియల్ ఎస్టేట్ వ్యాపారులు అక్రమ కట్టడాలు కడుతున్నారన్నారు. మాకు అధికారులు, రాజకీయ నాయకుల అండదండలు పుష్కలంగా ఉన్నాయి, మమ్మల్ని ఎవ్వరు ఏమి చేసుకోలేరు అంటూ విర్రవీగుతూ యదేచ్చగా వక్ఫ్ బోర్డ్ భూముల్లో నిర్మాణాలు చేపడుతున్నారన్నారు. శిరివెళ్ల వక్ఫ్ బోర్డ్ భూములలో అక్రమ నిర్మాణాలు ఆపకపోతే సోమవారం శిరివెళ్ల హైవే మీద ధర్నా కార్యక్రమం నిర్వహిస్తామన్నారు.

Comments

-Advertisement-