-Advertisement-

ఘోర రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ఆరుగురు మృతి...!

Latest crime news in Telugu, Crime news Telugu, today Crime news, Breaking News Telugu, latest updates in crime news telugu,crime news channels
Peoples Motivation

ఘోర రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ఆరుగురు మృతి...!

Thumbnails road safety news
యుపిలోని జౌన్పూర్ లో శనివారం అర్థరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మరణించారు. కాగా, ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన ముగ్గురిని వారణాసి ట్రామా సెంటర్ కు తరలించారు. ఆ కుటుంబం బీహార్ లోని సీతామర్హి నివాసితులు. అందరూ ఏదో ఒక పని నిమిత్తం ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ కి కారులో వెళ్తున్నారు. అయితే దారిలో ఇంటికి వెళ్తున్న కారు ట్రక్కును ఢీకొట్టింది. గౌరాబాదీపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రసాద్ తిరాహేలో ఈ ఘటన చోటుచేసుకుంది. శనివారం అర్థరాత్రి ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే ఒక్కసారిగా చుట్టుపక్కల వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఇంతలో గాయపడిన వారిని అంబులెన్స్ సహాయంతో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమంగా ఉండడంతో వారణాసిలోని ట్రామా సెంటర్ కు తరలించారు. అక్కడ వారికి చికిత్స కొనసాగుతోంది.

మృతుల్లో గజధర్ శర్మ,జవహర్ శర్మ, అనిల్ శర్మ, సోనమ్, గౌతమ్, రింకీ ఉన్నారని పోలీసులు తెలిపారు. కాగా గాయపడిన వారిలో మీనా శర్మ, యుగ్ శర్మ మరో గుర్తు తెలియని వ్యక్తి ఉన్నారు. ఈ విషయంలో పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. మరోవైపు ట్రక్కు డ్రైవర్, అతని సహచరుడు సంఘటనా స్థలం నుండి పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు వెతుకుతున్నారు. ఘటనా స్థలం నుంచి ట్రక్కు, కారును స్వాధీనం చేసుకున్నారు.

చుట్టుపక్కల వారు మాట్లాడుతూ... ప్రమాదం చాలా ఘోరంగా జరిగిందని. మృతదేహాలు కారులో ఇరుక్కుపోయాయి. రక్తం కాలువలా ప్రవహించింది. పోలీసులు చాలా శ్రమించి మృతదేహాలను బయటకు తీశారు. కారు ముక్కలైపోయింది. రాత్రి కూడా ప్రాణాలు పోయేందుకు కారణమైంది. ప్రస్తుతం ఈ ప్రమాదం పై విచారణ కొనసాగుతోంది.

Comments

-Advertisement-