-Advertisement-

ఘోర రోడ్డు ప్రమాదం ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు.. మృతి చెందిన ఐదుగురు..

Latest crime news in Telugu, daily crime news in Telugu, today Crime news, Breaking News Telugu, latest updates in crime news telugu,crime news Telugu
Peoples Motivation

ఘోర రోడ్డు ప్రమాదం ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు..

మృతి చెందిన ఐదుగురు..


Thumbnails crime news
నంద్యాల/ఆళ్లగడ్డ, మార్చి 06 (పీపుల్స్ మోటివేషన్):-

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం జాతీయ రహదారిపై నల్లగట్ల గ్రామం దగ్గర కడప నుండి కర్నూల్ రోడ్డుపై ఆగి ఉన్న లారీని వెనకవైపు నుండి కారు ఢీకొనగా కారులో ఉన్న ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. అందులో ముగ్గురు పురుషులు ఇద్దరు మహిళలు ఉన్నారు. వీరంతా తిరుపతి నుండి హైదరాబాద్ కు వెళ్తూ ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతి చెందిన వారందరూ హైదరాబాద్ కు చెందిన వారని తెలిసింది. ప్రమాద సంఘటన తెలిసిన వెంటనే హుటాహుటిన ఆళ్లగడ్డ రూరల్ సీఐ హనుమంత నాయక్ సిబ్బంది అక్కడికి చేరుకొని ట్రాఫిక్ అంతరాయం లేకుండా చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతిచెందిన వారి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Thumbnails crime news

Comments

-Advertisement-