-Advertisement-

పొలంలో కరెంట్ షాక్ కు గురై వ్యక్తి మృతి...

Latest crime news in Telugu, Crime news Telugu, today Crime news, Breaking News Telugu, latest updates in crime news telugu,crime news channels
Peoples Motivation

పొలంలో కరెంట్ షాక్ కు గురై వ్యక్తి మృతి...

క్రిష్ణగిరి /కర్నూలు, మార్చి 10 (పీపుల్స్ మోటివేషన్):-

విద్యుత్ ఘాతంతో (కరెంట్ షాక్) పొలంలో మృతి చెందిన ఘటన క్రిష్ణగిరిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే కర్నూలు జిల్లా క్రిష్ణగిరి మండల కేంద్రమైన క్రిష్ణగిరికి చెందిన కమ్మరి లక్ష్మణ ఆచారి (27 వయసు) శనివారం ఉదయం క్రిష్ణగిరి జలాశయం సమీపంలోని తన పొలంలో నీరు కట్టేందుకు వెళ్లి మోటార్ ఆన్ చేస్తుండగా కరెంట్ షాక్ కు గురై మృతి చెందినట్లు సమాచారం. మృతుని తండ్రి నాగరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు క్రిష్ణగిరి మండల ఎస్ఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. 

Thumbnails news channel

Comments

-Advertisement-