-Advertisement-

నంద్యాల టిడిపి పార్లమెంట్ బరిలో తెరపైకి మరో వ్యక్తి...

latest news telugu, breaking news in india, today latest news in telugu, latest news today, latest news live 5 latest news headlines latest news world
Peoples Motivation

నంద్యాల టిడిపి పార్లమెంట్ బరిలో తెరపైకి మరో వ్యక్తి...

రాష్ట్ర రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి.. వైసీపీ సిద్ధం సభలతో...టిడిపి రా కదలిరా సభలతో... జనసేన టిడిపి కూటమి జెండా సభతో ప్రజలను ఉత్తేజపరుస్తూ సభలను పోరెత్తిస్తున్నాయి. ఇదిలా ఉంటే నంద్యాల రాజకీయాలు రాష్ట్ర రాజకీయాలనే తలదన్నేలా శరవేగంగా మారుతున్నాయి. నేనంటే నేనని నాయకుల మధ్య పోటీ నెలకొంది. ఎంతోమంది మేధావులను దేశ రాజకీయాలను శాసించే స్థాయికి పంపిన గడ్డ నంద్యాల. అలాంటి నంద్యాల పార్లమెంట్ బరిలో ఎంపీ అభ్యర్థిగా టిడిపి పార్టీ తరఫున విద్యావేత్త డాక్టర్ కేవీ సుబ్బారెడ్డి అభ్యర్థి పేరు తెరపైకి వచ్చినట్లు ప్రచారం సాగుతోంది. ఇప్పటికే నంద్యాల పార్లమెంట్ ఇన్చార్జ్ మాండ్ర శివానందరెడ్డి టికెట్ పై ధీమాగా ఉన్నారు... బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కుమార్తె బైరెడ్డి శబరి తమకే టికెట్ వస్తుందని కర్నూలు నగరంలో సోమవారం రోజు జోరుగా ప్రసారం సాగింది. ఇదిలా ఉండగా పాణ్యం మాజీ ఎమ్మెల్యే బిజ్జం పార్థసారథి రెడ్డి కూడా నంద్యాల పార్లమెంటు టికెట్ ఆశిస్తున్నట్లు అంతర్గత సమాచారం. అధిష్టానం ఏ అభ్యర్థి పేరు ప్రకటిస్తుందోనని నాయకులు, కార్యకర్తలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు సమాచారం.

Thumbnails ndl parlament

Comments

-Advertisement-