-Advertisement-

చిన్నారుల మృతి తల్లిదండ్రుల పరారీ....

Latest crime news in Telugu, Crime news Telugu, today Crime news, Breaking News Telugu, latest updates in crime news telugu,crime news channels
Peoples Motivation

చిన్నారుల మృతి తల్లిదండ్రుల పరారీ....

మహబూబాబాద్/ గార్ల, మార్చి 10 (పీపుల్స్ మోటివేషన్):-

Thumbnails png news ts

మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలోని అంకన్నగూడెంలో విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటన సంచలనం రేకెత్తిస్తోంది. మృతి చెందిన చిన్నారుల దగ్గర తల్లిదండ్రులు లేకపోవడం తీవ్ర చర్చకు దారితీసింది. చిన్నారులు లోహిత (3), జశ్విత (1) అనుమానాస్పదరీతిలో మృతిచెందారు. వారు తాగే పాలలో విషం కలిపి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తల్లిదండ్రులు అనిల్, దేవి పరారీలో ఉన్నట్లు సమాచారం.

వివరాల్లోకి వెళితే... బయ్యారం మండలం నామాలపాడులో అనిల్, దేవి తమ పిల్లలతో కలిసి ఉంటున్నారు. వారం క్రితం అనిల్ తమ స్వగ్రామం అంకన్నగూడెంకు కుటుంబంతో కలిసి వచ్చాడు. అతడి తండ్రి వెంకన్న స్థానికంగా కిరాణా దుకాణం నిర్వహిస్తున్నాడు. ఆదివారం తెల్లవారుజామున షాపునకు వెళ్లిన వెంకన్న.. తిరిగి 10 గంటలకు ఇంటికి చేరుకున్నాడు. అప్పటికే ఇంట్లో చిన్నారులు విగతజీవులుగా పడి ఉన్నారు. అభం శుభం తెలియని పిల్లలను అలా చూసిన వెంకన్న లబోదిబోమన్నాడు. కుమారుడు, కోడలు ఎక్కడ కనిపించక పోయేసరికి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.

Comments

-Advertisement-