-Advertisement-

రూ.2.50 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సబ్ రిజిస్ట్రార్

latest news telugu, breaking news in india, today latest news in telugu, latest news today, latest news live 5 latest news headlines latest news world
Peoples Motivation

రూ.2.50 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సబ్ రిజిస్ట్రార్

మడకశిర/శ్రీసత్యసాయి జిల్లా, మార్చి 20 (పీపుల్స్ మోటివేషన్):-

శ్రీసత్యసాయి జిల్లా మడకశిర సబ్ రిజిస్ట్రార్ దామోదర్ ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. రూ.2.50 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. ఓ రైతు తన 6.36 ఎకరాల అసైన్డ్ భూమిని రిజిస్ట్రేషన్ చేసేందుకు సబ్ రిజిస్ట్రార్ను ఆశ్రయించాడు. ఎకరాకు రూ.50వేల చొప్పున ఇవ్వాలని సబ్ రిజిస్ట్రార్ డిమాండ్ చేశారు. డబ్బు తీసుకునే సమయంలో దామోదర్ తో పాటు దస్తావేజు లేఖరిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

ACB RIDES ON SUB REGISTRAR

Comments

-Advertisement-