-Advertisement-

విశాఖలో భారీ డ్రగ్స్ కంటైనర్ పట్టివేత 25వేల కిలోల మాదకద్రవ్యాలు సీజ్...

latest news telugu, breaking news in india, today latest news in telugu, latest news today, latest news live 5 latest news headlines latest news world
Peoples Motivation

విశాఖలో భారీ డ్రగ్స్ కంటైనర్ పట్టివేత 25వేల కిలోల మాదకద్రవ్యాలు సీజ్...

విశాఖపట్నం, మార్చి 21 (పీపుల్స్ మోటివేషన్):-

బ్రెజిల్ నుంచి జర్మనీ మీదుగా భారత్ వచ్చిన కంటైనర్ సీబీఐకి సమాచారం అందించిన ఇంటర్ పోల్ విశాఖలోని సీబీఐ, కస్టమ్స్ అధికారులను అప్రమత్తం చేసిన ఢిల్లీ సీబీఐ ఆఫీసు ఆపరేషన్ గరుడ చేపట్టి కంటైనర్ ను స్వాధీనం చేసుకున్న అధికారులు విశాఖపట్నం తీరంలో డ్రగ్స్ కలకలం రేగింది. బ్రెజిల్ నుంచి జర్మనీ మీదుగా వచ్చిన ఓ సరకు రవాణా కంటైనర్ లో 25 వేల కిలోల డ్రగ్స్ పట్టుబడింది. ఈ కంటైనర్ జర్మనీలోని హ్యాంబర్గ్ మీదుగా మార్చి 16న విశాఖ వచ్చినట్టు గుర్తించారు. ఈ కంటైనర్ భారత్ చేరుకున్న నేపథ్యంలో, ఇంటర్ పోల్ నుంచి ఢిల్లీ సీబీఐ కార్యాలయానికి సమాచారం అందింది. వెంటనే ఢిల్లీ సీబీఐ కార్యాలయం విశాఖ సీబీఐ, కస్టమ్స్ అధికారులను అప్రమత్తం చేసింది. ఈ నెల 19న నార్కొటిక్స్ అధికారులతో వచ్చి కంటైనర్ ను పరీక్షించిన సీబీఐ... అందులో ఉన్నది నిషిద్ధ మాదకద్రవ్యాలు అని నిర్ధారించుకుంది. 25 కిలోల చొప్పున వెయ్యి బ్యాగులు ఉన్నట్టు గుర్తించారు. ఆపరేషన్ గరుడ పేరిట నిర్వహించిన స్పెషల్ ఆపరేషన్ లో ఈ డ్రగ్స్ పట్టుకున్నారు. కాగా, ఈ డ్రగ్స్ ఓ ప్రైవేట్ ఆక్వా కంపెనీ ఎగుమతుల ద్వారా భారత్ కు వచ్చినట్టు సమాచారం అందుతోంది. దీనిపై పూర్తి విచారణ జరుగుతున్నట్లు సమాచారం.

Vishakha drugs sease

Comments

-Advertisement-