టీడీపీ అభ్యర్థుల మూడో జాబితా...11 ఎమ్మెల్యే, 13 ఎంపీ స్థానాల ప్రకటన
latest news telugu,
breaking news in india, today latest news in telugu,
latest news today,
latest news live
5 latest news headlines
latest news world
By
Peoples Motivation
టీడీపీ అభ్యర్థుల మూడో జాబితా...11 ఎమ్మెల్యే, 13 ఎంపీ స్థానాల ప్రకటన
అమరావతి, మార్చి 22 (పీపుల్స్ మోటివేషన్):-
టీడీపీ అభ్యర్థుల మూడో జాబితా విడుదలైంది. 11 శాసనసభ స్థానాలతో పాటు 13 మంది ఎంపీ అభ్యర్థులను ఆ పార్టీ ప్రకటించింది. పొత్తులో భాగంగా 144 అసెంబ్లీ, 17 పార్లమెంట్ స్థానాల్లో తెదేపా పోటీ చేయనుంది. ఇదివరకే 128 శాసనసభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా.. తాజాగా మరో 11 మంది అభ్యర్థులను ప్రకటించారు. ఇంకా 5 అసెంబ్లీ, 4 ఎంపీ స్థానాలను పెండింగులో ఉంచింది.
అసెంబ్లీ స్థానాల అభ్యర్థులు..
- పలాస-గౌతు శిరీష
- పాతపట్నం- మామిడి గోవిందరావు
- శ్రీకాకుళం-గొండు శంకర్
- శృంగవరపుకోట- కోళ్ల లలితకుమారి
- కాకినాడ సిటీ- వనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబు)
- అమలాపురం (ఎస్సీ)- అయితాబత్తుల ఆనందరావు
- పెనమలూరు-బోడె ప్రసాద్
- మైలవరం- వసంత వెంకట కృష్ణప్రసాద్
- నరసరావుపేట- చదలవాడ అరవిందబాబు
- చీరాల- మద్దులూరి మాలకొండయ్య యాదవ్
- సర్వేపల్లి- సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి
లోక్సభ స్థానాల అభ్యర్థులు..
- శ్రీకాకుళం- కింజరాపు రామ్మోహన్నాయుడు
- విశాఖపట్నం- మతుకుమిల్లి భరత్
- అమలాపురం- గంటి హరీష్
- ఏలూరు- పుట్టా మహేశ్ యాదవ్
- విజయవాడ- కేశినేని శివనాథ్ (చిన్ని)
- గుంటూరు- పెమ్మసాని చంద్రశేఖర్
- నరసరావుపేట- లావు శ్రీకృష్ణ దేవరాయలు
- బాపట్ల- టి.కృష్ణ ప్రసాద్
- నెల్లూరు- వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి
- చిత్తూరు- దగ్గుమళ్ల ప్రసాదరావు
- కర్నూలు- బస్తిపాటి నాగరాజు (పంచలింగాల నాగరాజు)
- నంద్యాల- బైరెడ్డి శబరి
- హిందూపురం- బీకే పార్థసారథి
Comments