అట్టహాసంగా పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం
political news, tdp news, Kadapa news
By
Peoples Motivation
అట్టహాసంగా పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం
వసంత పేట (రామేశ్వరం) లో టీడీపి కార్యాలయం ప్రారంభం
ప్రొద్దుటూరు, ఫిబ్రవరి 05 (పీపుల్స్ మోటివేషన్):-
ప్రొద్దుటూరు నియోజకవర్గం వసంతపేటలో నేడు తెలుగుదేశం పార్టీ కార్యాలయం అట్టహాసంగా ప్రారంభోత్సవం జరిగింది. టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి డా. జివి ప్రవీణ్ కుమార్ రెడ్డి మరియు మాజీ కౌన్సిలర్ జి.సీత రామి రెడ్డి ల ఆధ్వర్యంలో ప్రారంభోత్సవ కార్యక్రమం అట్ట హాసంగా జరిగింది.
ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాస రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి హాజరయ్యారు.
గాంధీ రోడ్డు మున్సిపల్ మోటు వద్ద నుండి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున భారీ ర్యాలీగా నూతన కార్యాలయం వద్దకు తరలి వెళ్లారు. ప్రారంభోత్సవంలో నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments