రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

బ్రేక్ ద‌ర్శ‌నం భక్తులకు ఎస్ఎంఎస్ పే సిస్ట‌మ్‌

ttd news, temple news
Peoples Motivation


బ్రేక్ ద‌ర్శ‌నం భక్తులకు ఎస్ఎంఎస్ పే సిస్ట‌మ్‌


ఎంబిసి-34కు వెళ్లాల్సిన అవ‌స‌రం లేదు

ఆన్‌లైన్‌లో సొమ్ము చెల్లించి టికెట్ ప్రింట్ తీసుకోవచ్చు


తిరుపతి తిరుమల శ్రీ‌వారి ద‌ర్శ‌నం కోసం విచ‌క్ష‌ణ కోటాలో కేటాయించే బ్రేక్ ద‌ర్శ‌నం టికెట్లు పొందే భ‌క్తుల సౌక‌ర్యార్థం టీటీడీ నూత‌నంగా ఎస్ఎంఎస్ పే సిస్ట‌మ్ విధానాన్ని ప్ర‌వేశ‌పెట్టింది. ఫిబ్ర‌వ‌రి ఒక‌టో తేదీ నుండి ఈ విధానాన్ని అమ‌లుచేస్తోంది. 

         నూతన విధానంలో ఎస్ఎంఎస్ ద్వారా పే లింక్ ను పంపుతారు. భక్తులు ఆ లింక్ పైన క్లిక్ చేసి యుపిఐ లేదా క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు ద్వారా ఆన్లైన్ లో సొమ్ము చెల్లించి ఎంబీసీ-34 కౌంటర్ వద్దకు వెళ్లాల్సిన అవ‌స‌రం లేకుండా బ్రేక్ ద‌ర్శ‌న‌ టికెట్లు ప్రింట్ తీసుకోవచ్చు. ఇప్ప‌టికే ఆఫ్‌లైన్‌లో సిఆర్ఓలో లక్కీడిప్ ద్వారా ఆర్జిత సేవాటికెట్లు పొందుతున్న‌ భక్తులకు ఈ విధానం అమ‌లు చేస్తున్నారు.

Comments

-Advertisement-