బ్రేకింగ్ న్యూస్...నుషుల ప్రాణాలకే దిక్కులేదు-మూగజీవాలకు దిక్కెక్కడా...
Kadapa news, police news, crime news, proddatur news, ap news, rayalaseema news, pm news
By
Peoples Motivation
మనుషుల ప్రాణాలకే దిక్కులేదు-మూగజీవాలకు దిక్కెక్కడా...
-లారీ ఢీకొని 70 గొర్రెల మృతి
-మైదుకూరు కేసీ కెనాల్ వద్ద స్కూటర్ను స్కార్పియో ఢీకొన్న ఘటన మరువక ముందే మరో ఘటన
-గ్రామీణ ప్రాంతాల్లో కూడా రోడ్డు భద్రత అవగాహన సదస్సులు నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది..
-ప్రజలు, వాహనదారులు రోడ్లపై జాగ్రత్త వహించాలి..
ప్రొద్దుటూరు (పెద్ది శెట్టి పల్లె), ఫిబ్రవరి 13 (పీపుల్ మోటివేషన్):-
పొద్దుటూరు పట్టణం రూరల్ పరిధిలోని పెద్ద శెట్టి పల్లె గ్రామపంచాయతీ సమీపంలో పొలాల్లో మేపడానికి వెళ్తున్న మూగజీవాల ను లారీ ఢీ కొన్న ఘటన జరిగింది. లారీ ఢీకొన్న ప్రమాదంలో బొమ్మాయిపల్లి గ్రామానికి చెందిన దాదాపు 70 గొర్రెలు మృతి చెందాయి. జరిగిన ఈ షాకింగ్ ఘటనతో గొర్రెల యజమాని కన్నీటి పర్యంతం అయ్యారు.
ఇంతలో లారీ ఆపకుండా వేగంగా ముందుకు వెళ్ళిపోయింది. ఘటన స్థలానికి చేరుకున్న రూరల్ ఎస్సై శివప్రసాద్ సంఘటన ప్రాంతాన్ని పరిశీలించి బాధితులతో మాట్లాడి న్యాయం చేస్తామని ఈ ఘటనకు కారణమైన లారీని గుర్తించి బాధితుడికి న్యాయం చేస్తామని వెల్లడించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
సానే గిరిబాబు
పీపుల్స్ మోటివేషన్ తెలుగు డైలీ
కడప జిల్లా ఇంచార్జ్..✍️
Comments